స్వామీ! నీ పాదధూళిచే పవిత్రమైనవారు
వేరే స్వర్గమోక్షములను మనస్సులో కూడ కోరరు.
స్వర్గ, మోక్షములకు పోవుచున్నవారు
మార్గములో నీ గుడి గోపురముల
శిఖరములను చూచి ఆనందపరవశులై
మనుష్యులుగా భూలోకమునందే
మిమ్ము దర్శించుచు ఉండవలెనని కోరుచుందురు.
ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాతమగు గాక.
No comments:
Post a Comment